ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ను వెంటనే విడుదల చేయాలని తీన్మార్ మల్లన్న టీం ములుగు జిల్లా కో కన్వీనర్ అచ్చూనురి కిషన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతులను నిర్భంధించడంలో ఉన్న శ్రద్ధ, ప్రజా సంక్షేమ పై పెట్టి ప్రజాదరణ పొంది, జవాబుదారుగా వ్యవహరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి అణచాలని చూస్తే భారత రాజ్యాంగం ప్రకారం, న్యాయ స్థానాల ద్వారా బయటకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో అంతే రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. అలాగే ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను సభ్య సమాజం, మేధావులు, విద్యావంతులు, అభ్యుదయ వాదులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు పరిశీలిస్తున్న విషయాన్ని మరవద్దు అని రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
next post