సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం సీత్లతండ,కింది తండా,చెన్నాయి పాలెం గ్రామాలలో గిరిజన సోదరులు ఘనంగా జరుపుకునే ముఖ్యమైన తీజ్ పండుగ వేడుకలో ముఖ్య అతిథిగా ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగకు తనను ముఖ్య అతిథిగా పిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సీత్లతండలో బొడ్రాయి ప్రతిష్టకు రఘు హమీ ఇచ్చారు.అదే విధంగా ప్రతి తండ లోని ప్రతి ఒకరిని నా సొంత మనుషుల్లా భావిస్తానని ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్ధంగా సేవ చేయడానికి మీ ముందుకి వచ్చానని తెలిపారు.
రేపటి రోజున తండా వాసులందరూ తనను ఆశీర్వదించినట్లైతే రాబోయే రోజుల్లో మీఇంటి సొంత మనిషిలా దగరుండి మీకందరికీ సేవ చేస్తానని అన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి అరోగ్య బాధ్యత తనదే అని,ప్రతి విద్యార్థి చదువుకు,నిరుద్యోగుల ఉద్యోగ సాధికారతకు బాధ్యత కూడా తనదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న,ఫౌండేషన్ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్