సూర్య పేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం లోని గుర్రంపోడు తండాలో శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ దేవాలయం వద్ద తీజ్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
పండుగ వేడుకలకు మఠంపల్లి మండల ఎంపిపి మూడవతు పార్వతి కొండానాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామ దేవత శుభ అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సిరి సంపదలతో,పాడి పంటలతో చల్లగా చూడాలని,కరోనా తొలగిపోయి సుఖసంతోషాలతో ఉండాలని,తండా వాసులు అందరూ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కొండా నాయక్,సర్పంచ్ పార్వతి రామారావు నాయక్, మాజీ ఎంపిటిసి గ్రామ పెద్దలు,మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్