రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రామంతాపూర్ లో డివిజన్ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరులను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
ఆమెతో బాటు సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక చారిత్రక అవసరమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఎన్నో త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ఆమె తెలిపారు.