25.2 C
Hyderabad
March 23, 2023 00: 44 AM
Slider తెలంగాణ

ప్రధాని మోదీతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ

kcr modi

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా సమావేశమై ప్రధానితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్రం సహకారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధుల కేటాయింపు, పెండింగ్‌లో ఉన్న విభజన హామీల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీని తెలంగాణ సిఎం కేసీఆర్‌ కోరినట్లు సమాచారం

Related posts

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

Satyam NEWS

ఎంఆర్ఓ మోసంతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ గా భానుప్రియ ప్రమాణస్వీకారం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!