తెలంగాణ వ్యతిరేక ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో సకల జనుల సమ్మె చేసి విరమించిన రోజు కూడా ప్రభుత్వం కార్మికులను అడ్డుకోలేదని, అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. కొల్లాపూర్ లో నేడు ఆయన ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లేని సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద రాజులే ప్రజల దెబ్బకు మట్టికరిచారని మంద కృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ ఎంత అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసిని సొంత వారికి అమ్ముకోవాలని స్థిరంగా నిర్ణయించుకున్నందునే కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు వస్తే అడ్డుకోవడం, పోలీసులను పెట్టి నిలువరించడం దారుణమని ఆయన అన్నారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఇక్కడ ఎందుకు అమలు కాదు అని కార్మికులు ప్రశ్నిస్తుంటే అరెస్టు చేయిస్తున్నారని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీని అమ్మ కుండా అడ్డుకోకపోతే ఆర్టీసీ కార్మికులు బలహీన పడతారని ఆయన అన్నారు. కేసీఆర్ తెలంగాణ వచ్చిన కొత్తలో ఆర్టిసి కార్మికుల గురించి ఏం మాట్లాడారో, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమం నడుస్తుంటే ఏం మాట్లాడారో ఆడియోలు పేపర్ కటింగ్ లను ఆయన చూపించారు.
previous post