39.2 C
Hyderabad
April 25, 2024 18: 50 PM
Slider నల్గొండ

ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం

#TRS Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని TRS క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త ఫ్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి,తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు.అనంతరం హుజుర్ నగర్ పట్టణం లోని ఉద్యమకారులను సన్మానించారు.

ఈ సందర్భంగా TRS పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి పునాదులు అయ్యాయని, మొక్కవోని దీక్షతో ముఖ్యమంత్రి KCR తన మరణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణను సాధించిన తెలంగాణ జాతిపిత అని కొనియాడారు.

పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు KLN రెడ్డి,పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,మాజీ మున్సిపల్ చైర్మన్  దొంతగాని శ్రీనివాస్ గౌడ్,పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్,

అట్లూరి హరిబాబు,చిలకరాజు అజయ్ కుమార్, కె ఎల్ న్ రావు, చెవుల కవిత, ఎర్రంశెట్టి పిచ్చయ్య,జూలకంటి రామనర్సమ్మ, ఇట్టిమల్ల మధు,కోలపూడి దయాకర్,  రాంబాబు, గిన్ రెడ్డి వెంకటరెడ్డి,కోటేశ్వరరావు,నరసింహారావు, మంగమ్మ,మున్నా,స్వప్న,నరసింహారావు, సైదులు, సోమపొంగు రవీందర్, నరేష్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ జెండాలో కూడా కమర్షియల్ ఆలోచనలు చేస్తే ఎలా?

Satyam NEWS

టర్కీలో భూకంపం: 53 మంది మృతి

Bhavani

అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిన సిరిమానోత్సవం..

Satyam NEWS

Leave a Comment