తెలంగాణ విమోచన దినోత్సవంగా సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నేడు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంతరి కల్వకుంట్ల తారకరామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మైమూద్ అలీ, GHMC మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు ఉన్నారు.