తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకు అంకితభావంతో పని చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొని ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలోని బిజినె గడ్డ తండా లో ఎస్టి కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. అలాగే రూ. 38 లక్షలతో నిర్మించిన గిరిజన వసతి గృహం, వంటగది, మౌలిక సదుపాయాల వసతులను మంత్రి ప్రారంభించారు అలాగే రాజపేట గ్రామ శివారులోని గిరిజన గురుకుల పాఠశాల ప్రహరీ గోడ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
పెద్దమందడి మండలం విరాయి పల్లి గ్రామంలో పెద్దమందడి, గణపురం మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్