తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘానికి జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా హన్మంత్ నాయక్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ రోజు జరిగిన ఎన్నికలలో వివిధ శాఖల 262 మంది గ్రూప్ 1 అధికారులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా తమ ఓటు వినియోగించుకున్నారు. చంద్ర శేఖర్ గౌడ్ తమ సమీప ప్రత్యర్థి అజయ్ కుమార్ పై 62 ఓట్ల తేడా తో విజయం సాధించగా, హన్మంత్ నాయక్ తన సమీప ప్రత్యర్థి సోమ శేఖర్ పై 10 ఓట్ల తేడాతో విజయం సాధించారని ఎన్నికల అధికారి ఖురేషి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 అధికారుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తామని త్వరలో జరగబోయే సర్వ సభ్య సమావేశం లో ఇతర కార్యవర్గాన్నినియమిస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. మంత్రి కేటిఆర్, శ్రీనివాస్ గౌడ్ల ద్వారా ముఖ్యమంత్రి కేసిఆర్ ని కలిసి తమ సమస్య లను నివేదిస్తామని తెలిపారు. నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్ర శేఖర్ గౌడ్, హన్మంత్ నాయక్ లను శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
previous post