28.7 C
Hyderabad
April 20, 2024 08: 12 AM
Slider ముఖ్యంశాలు

వైవిద్యమైన వ్యవసాయం చేయడంలో తెలంగాణ  ఫస్ట్

#ajay

వైవిద్యమైన వ్యవసాయం చేయడంలో రాష్ట్రం  ముందుందని, ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సరఫరాతో రాష్ట్రంలో ప్రతి పంటను రైతులు స్వేచ్చగా పండిస్తున్నారని, ప్రతి ఏడాది ఆయా పంటల దిగిమతి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను ప్రారంభించిన అనంతరం వారు మాట్లడుతూ నాటి ఉమ్మడి రాష్ట్రంలో పండించిన పంటను రైతులు దాచుకునే వెసులుబాటు లో లేకుండా పోయిందని, దానికి శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఅర్  ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. వ్యవసాయం చేస్తూనే రైతులు రైతులు ఆనందం పొందుతారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తిని అద్భుతం పండిస్తున్నారు, ఖమ్మం జిల్లా నుండి అత్యధికంగా పండిస్తున్న వారిలో జిల్లా ముందంజలో ఉందన్నారు. ఒకప్పుడు వ్యవసాయం చెయ్యాలంటే విద్యుత్ ఎప్పుడు వస్తాదో,. ఎప్పుడు ఉంటదో ఆయా అధికారులకే తెలియదన్నారు. కానీ నేడు నిరంతర ఉచిత విద్యుత్ ను అందిస్తూ వ్యవసాయ రంగాన్ని నడిపిస్తున్నారని అన్నారు. నాడు పొలాల్లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపితే మళ్ళీ అక్కడ మరొక ట్రాన్స్ఫార్మర్ రావాలంటే ఆ గోస రైతులకే తెలుసన్నారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీడు భూములన్ని పచ్చరంగు పులుముకున్నాయన్నారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, చెక్ డ్యాముల నిర్మాణం, మినీ లిఫ్టులతో మిర్రు ప్రాంతాలకు సాగునీరును అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించడం ద్వారా లాభసాటి వ్యవసాయం చేయాలని అన్నారు. సాగునీరు అందించడంతో రైతులు, గ్రామస్తులు వ్యవసాయ పనులలో నిమగ్నమై గ్రామంలో సమావేశాలకు, సభలకు వచ్చే పరిస్థితి లేదన్నారు.

Related posts

గుర‌జాడ విశ్వ‌విద్యాల‌య స్థాప‌న‌: విద్య‌, ఉద్యోగావకాశాలకు మేలిమ‌లుపు

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం..

Sub Editor

Leave a Comment