39.2 C
Hyderabad
March 28, 2024 16: 13 PM
Slider నిజామాబాద్

తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్ర లేదు

#shabberali

తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్ర ఏమి లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తేలేదని, అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని చెప్పారు. తమ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

విగ్రహావిష్కరణ అనంతరం రెడ్డి ఫంక్షన్ హాలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. వడ్డే ఓబన్న బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమరయోధుడని, తెల్ల దొరల అక్రమ పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దిశాలి అని కొనియాడారు. నాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడి భుజంగా ఉద్యమంలో ఓబన్న పాల్గొన్నారని తెలిపారు.

ఓబన్న విగ్రహాన్ని అవిష్కరిస్తున్న షబ్బీర్ అలీ

భయం ఎరుగని వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం ఈస్ట్ ఇండియా సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ఓబన్న ముఖ్య పాత్ర పోషించాడని, అలాంటి వడ్డే ఓబన్న వీరత్వం సమాజం గుర్తించకపోవడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డే ఓబన్న చరిత్ర పాఠ్యపుస్తకాలు చేరుస్తామన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని విస్మరించి ఉద్యమంలో లేని వారికి మంత్రులు చేసిందన్నారు. 60 సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రo ఏర్పాటని, సోనియా గాంధీ పుణ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందన్నారు. గడిచిన ఎనిమిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర లేదని, పైగా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణకు మిగిలిందన్నారు. టీఆర్ఎస్ బిఅర్ఎస్ గా మార్చి ఎవరిని ఒరగ బెడతారని ప్రశ్నించారు.

ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ది కోసం కేసీఆర్ దగ్గరి నుండి నిధులు తెచ్చే దమ్ముందా అని నిలదీశారు. కాళేశ్వరంపై విచారణ చేస్తే అవినీతి బయట పడుతుందన్నారు. బిజెపి పాలనలో దేశం వెనుక బడి పోయిందని, దేశంలో ప్రజల అభివృద్ధి లేదు కానీ ఆదాని, అంబానీలు బాగుపడుతున్నారన్నారు. ప్రపంచ ఆర్థిక సూచిలో దేశం 121 స్థానంలో ఉండటం సిగ్గు చేటన్నారు. రాహుల్ పాదయాత్రతో బిజెపి, ఆర్ఎస్ఎస్ లలో కదలికలు మొదలయ్యాయన్నారు. జిల్లాలో సాగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, భీమ్ రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, లింగారెడ్డి, మోహన్ రెడ్డి, పాక జ్ఞానేశ్వరి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోలాహలంగా కోడి రామకృష్ణ జయంతి వేడుకలు

Satyam NEWS

తెలంగాణలో కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్న పెప్సికో

Bhavani

నెల రోజుల పాటు జరగనున్న జగనన్న సురక్ష       

Satyam NEWS

Leave a Comment