దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న రాథోడ్ బాపురావు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఎం నటరాజన్ లతో కలిసి ఎన్టీఆర్ చౌక్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అక్కడ్నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పనితీరు తో యావద్దేశం రాష్ట్రం వైపు చూస్తుందని అందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు నిదర్శనమన్నారు. ఆదిలాబాద్ జిల్లాను సైతం రాష్ట్రంలోని ఆదర్శంగా నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.
కరోనా కారణంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నామని , భవిష్యత్తులో వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తామని వెల్లడించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర, ఓఎస్డి హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, అడిషనల్ ఎస్ పి వినోద్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కాంబ్లే నాందేవ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.