ఇటీవల MLC గా అఖండ మెజారిటీతో గెలుపొందిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తో తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డా.పోరిక రవీందర్ నేడు భేటీ అయ్యారు.
హైదరాబాద్ లోని కవిత స్వగృహంలో ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం ఎం ఎల్ సి కవిత కు మేడారం సమ్మక్క సారలమ్మల చిత్రపటాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు గంటమారి భాగ్య, ములుగు జిల్లా అధికార ప్రతినిధి అంతటి రాము, విద్యార్థి అధ్యక్షులు గుగులోత్ హరిలాల్,
సోషల్ మీడియా ఇంఛార్జి నాజర్ ఖాన్, దివ్యాంగ శాఖ అధ్యక్షులు రాయబారపు రమేష్, సాంస్కృతిక విభాగం అమ్మపాట తిరుపతి పాల్గొన్నారు.