తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం మిర్యాలగూడ క్రాస్ రోడ్డు సెంటర్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఎలక వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడుతూ రజాకార్లకు ఎదురొడ్డి ప్రాణాలను లెక్క చేయక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది తెలంగాణ సాయుధ పోరాట యోధులు అమరులు అయ్యారని, వారి పోరాటం, అమరత్వ, త్యాగ ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న, తెలంగాణ భారతదేశంలో విలీనం అయిందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన’ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ పట్టణ తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్, హుజూర్ నగర్ ఆర్ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు రెక్కల శభిరెడ్డి,
నల్లగొండ పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి నలమాద శ్రీనివాస్ యాదవ్, నల్లగొండ పార్లమెంట్ టిడిపి తెలుగు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ రామజోగి గౌడ్, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జనిగల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్, షేక్ అలీ, మీసాల సైదులు, దొంతగాని సోములు తదితరులు పాల్గొన్నారు.