పెద్దపల్లి నియోజకవర్గంలో ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అంతరం పెద్దపల్లి జిల్లా జూనియర్ కళాశాల మైదానంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధు, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, లోకల్ బాడీ కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, రామగుండం సీపీ, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్,మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి, DCP, జిల్లా ప్రభుత్వ అధికారులు,పోలీస్ అధికారులు,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.