28.2 C
Hyderabad
April 20, 2024 12: 53 PM
Slider నల్గొండ

తెలంగాణ ప్రజలంతా సిఎం KCR వైపే ఉన్నారు

#MLASaidireddy

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా Dr పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు.

నేడు నల్గొండలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు హాజరుకావడం పట్ల ఎమ్మెల్యే సైదిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. ప్రజలంతా సిఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు.

ఏ ఎన్నికలైనా టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని, ఎంతమంది ఎన్ని మాయమాటలు చెప్పినా తెలంగాణా ప్రజలంతా సిఎం KCR, KTR వెంటే ఉంటారని అన్నారు.

పనిచేసే పల్లా రాజేశ్వర్ రెడ్డికి పట్టభద్రులంతా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కడెం వెంకట రెడ్డి,జిల్లా డీసీసీబీ మెంబర్ రంగాచారి,MPP గూడెపు శ్రీను, గ్రంధాలయ చైర్మన్ సంపత్ వర్మ, టిఆర్ఎస్ శ్రేణులు, పట్టభద్రులు తదితరులు పాల్గోన్నారు.

Related posts

జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మూసివేత

Satyam NEWS

సంక్రమణం

Satyam NEWS

వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్

Satyam NEWS

Leave a Comment