టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా Dr పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు.
నేడు నల్గొండలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు హాజరుకావడం పట్ల ఎమ్మెల్యే సైదిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. ప్రజలంతా సిఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు.
ఏ ఎన్నికలైనా టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని, ఎంతమంది ఎన్ని మాయమాటలు చెప్పినా తెలంగాణా ప్రజలంతా సిఎం KCR, KTR వెంటే ఉంటారని అన్నారు.
పనిచేసే పల్లా రాజేశ్వర్ రెడ్డికి పట్టభద్రులంతా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కడెం వెంకట రెడ్డి,జిల్లా డీసీసీబీ మెంబర్ రంగాచారి,MPP గూడెపు శ్రీను, గ్రంధాలయ చైర్మన్ సంపత్ వర్మ, టిఆర్ఎస్ శ్రేణులు, పట్టభద్రులు తదితరులు పాల్గోన్నారు.