39.2 C
Hyderabad
March 28, 2024 15: 42 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ అభివృద్ది చేసింది టి‌డి‌పినే

#nara

తెలంగాణ అభివృద్ది చేసింది టి‌డి‌పినే నని, నాడు తమ పథకాలను విమర్శించిన వారు ఇప్పుడు వాటి వల్లే అభివృద్ది జరుగుతుందని చెపుతున్నారని టి‌డి‌పి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చాలా కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సభ కు ఖమ్మం జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలౌ భారీగా తరలి వచ్చారు. ఒక నాయకుడు లేకుండానే టి‌డి‌పి పై అభిమానంతో వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబు వుబ్బి తబ్బిబ్బయ్యారు. టి‌డి‌పి నేతలైతే ఇది తమ సభనేనా అని అనటం గమనార్హం. 30 కిలోమీటర్ల మేర ఖమ్మం జిల్లా లో ప్రయాణించిన బాబుకు అడుగడుగునా స్వాగతం పలికారు. పార్టీలకు అతీతంగా అందరూ రోడ్ల పై కి వచ్చి అభివాదం చేయటం విశేషం. ఈ సందర్భంగా  ఖమ్మం లో జరిగిన భహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  జీవితంలో యెపుడు చూడని వుత్సాహం ఇప్పుడు చూస్తున్నానని అబివాదం చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ది తమ హయాంలోనే జరిగిందని చెప్పారు. తెలుగుదేశం అంటే  తెలుగు వారి ఆత్మగౌరవం అని, ఎన్‌టి‌ఆర్ వందేళ్ల జయంతి వేడుకలు చేసుకుంటున్నాం అని, ఆయన స్పూర్తి తో  ముందుకు పోవాలన్నారు. ఇదే సమయం లో టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, టీడీపీ వల్లనే తెలంగాణలో, ఖమ్మం జిల్లాలో అభివృద్ది జరిగిందని , టీడీపీ పుట్టింది హైదరాబాద్ లో…పేదల అభివృద్ధికి కృషి చేసిన పార్టీ టీడీపీ అని, హైదరాబాద్ అభివృద్ధి చేసింది మనమేనని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కు ఆదాయ వనరుగా హైదరాబాద్ ఆవిర్భవించిందన్నారు. 

25 ఏళ్ల క్రితం దూరదృష్టి తో తీసుకున్న నిర్ణయాలతో హైదరాబాద్ అభివృద్ధి సాధ్యం అయ్యిందని, నాడు సెల్ఫోన్ గురించి మాట్లాడితే హేళన చేశారు…ఇప్పుడు ఏమంటారో చెప్పాలన్నారు. అలాంటి సంస్కరణలకు నాంది పలికింది టీడీపీ అని, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం వచ్చింది టీడీపీ వల్లనే నన్నారు. రైతు పిల్లలు, రైతు కూలీల పిల్లలను ఐ‌టి  నిపుణులుగా చేసిన పార్టీ టీడీపీ ఆని, టి‌డి‌పి యే రాష్ట్రంలో వున్నా ప్రజలకోసం పని చేస్తుందన్నారు.  తెలుగు దేశం పార్టీ ద్వారానే ఏదైనా సాధ్యమని చెప్పారు. తెలంగాణ లో పార్టీకి బలమైన కార్యకర్తలు వున్నారని, నేతలను మనం గెలిపించినా వేరే పార్టీలోకి పొయారని, ఐనా కార్యకర్తలు  టి‌డి‌పి లోనే వుండటం గర్వకారణం అన్నారు. నాటి టి‌డి‌పి విధానాల వల్లే  ఇప్పుడు ప్రపంచం తో పోటీ పడుతున్నామని చెప్పారు. తాను ఎన్నికలకోసం ఎప్పుడు పనిచేయలేదని, బాలకృష్ణ ఆన్ స్తపాబుల్ కార్యక్రమంలో అనేక విషయాలు చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ లో టి‌డి‌పి చేసిన అభివృద్దిని ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పుడు తమను విమర్శించే వారంతా ఒకప్పుడు టి‌డి‌పి విధానాల వల్లే రాజకీయం చేశారన్నారు. ఐ‌టి అభివృద్ది చేసింది తామేనని దేశం మొత్తం చెపుతుందని పేర్కొన్నారు.

Related posts

రామాలయం మూసివేత

Murali Krishna

జీర్ణమైన వస్త్రాలు పారేయకండి.. పేదలకు పంచుదాం

Satyam NEWS

పాఠశాలలను అందంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు మన బడి

Satyam NEWS

Leave a Comment