రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి మంటల్లో దహనం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన భోగి వేడుకల్లో నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.
రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టాలు తెచ్చిందని మండిపడ్డారు. చట్టం ప్రతులను భోగిమంటల్లో వేశారు. పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.
ప్రజావేదికను కూల్చి శాడిస్టుగా వ్యవహరించారని అన్నారు. ఏడు వరుస విపత్తులతో రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వలేదు. అసత్యాలతో రైతులను దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.