గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ అరవింద్ బాబును పోలీసులు కొట్టారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నరసరావుపేట DSP విజయ్ భాస్కర్ తెలిపారు. అరవింద బాబు ని పోలీసులు కొట్టలేదని, ఇదంతా అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం జొన్నలగడ్డ లో వైఎస్ఆర్ విగ్రహం మాయమైందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సి సి ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన వెల్లడించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వారిని వదిలేయాలంటూ తెలుగుదేశం నాయకులు ఆందోళన చేశారని, విచారణ జరగకుండా అడ్డుపడ్డారని DSP విజయ్ భాస్కర్ తెలిపారు. జొన్నలగడ్డ లో తెలుగుదేశం నాయకుల ధర్నా వల్ల సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారు చాలా ఇబ్బంది పడ్డారని, తెలుగుదేశం నాయకుల్ని ధర్నా విరమించమని రెండు గంటలపాటు బ్రతిమాలామని ఆయన తెలిపారు. అయినా వినకుండా తెలుగుదేశం నాయకులు పోలీసులను దుర్భాషలాడారని DSP విజయ్ భాస్కర్ తెలిపారు. పోలీసు వాహనాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వంసం చేశారని ఆయన అన్నారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్