39.2 C
Hyderabad
April 25, 2024 15: 39 PM
Slider కడప

తెలుగు మహిళ, టి.యన్.యస్.ఎఫ్ నేతల నిరసన ప్రదర్శన….

#TDP

దిశచట్టం ద్వారా నేటికి రమ్య కుటుంబానికి న్యాయం జరగనందున రాజంపేట బైపాస్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగు మహిళ, టి.యన్.యస్.ఎఫ్ నేతల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన ప్రదర్శన చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు..

కడప జిల్లా రాజంపేట పట్టణంలో బైపాస్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం తెలుగు మహిళ, టి.యన్.యస్. ఎఫ్ నేతల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.దిశచట్టం ద్వారా నేటికి రమ్య కుటుంబానికి న్యాయం జరగనందున నిరసన,అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్ర టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన తెలియ జేశారు.కాగా పట్టణ పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. నిరసన కారుల మధ్య పోలీసుల కొంత సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరి మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ , టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు రేవూరి వేణుగోపాల్,జిల్లా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంజాబ్ లో కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో 15 మంది

Sub Editor

బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం

Bhavani

మోడీ ఆన్ ఫైర్: 12 రోజుల్లో పాకిస్తాన్ ను ఓడిస్తాం

Satyam NEWS

Leave a Comment