32.7 C
Hyderabad
March 29, 2024 12: 56 PM
Slider కడప

అన్నా క్యాంటిన్ల కోసం టీడీపీ నేతల వంటా వార్పు

bhatyala 24

మూత పడిన అన్న క్యాంటీన్ల ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరుద్దించాలని రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో సోమవారం “ప్రజా చైతన్య యాత్ర”లో భాగంగా రాజంపేట పట్టణంలోని అన్నా కాంటీన్ వద్ద అన్నా కాంటీన్ల మూసివేతపై నిరసనగా “వంటా వార్పు” కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా భత్యాల మాట్లాడుతూ ఐదు రూపాయలకే పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను, గత టీడీపీ ప్రభుత్వం పెట్టిందనే అక్కసుతో మూత వేశారని ఆరోపించారు. మళ్ళీ తెరుస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సుధాకర్, దరూరి కృష్ణ చైతన్య, కళాధర్ బాబు,మళ్ళెం తిరిపాలు, మన్నూరు రాజా,పోలి శివా,భారతాల శ్రీధర్ బాబు,బాసినేని వెంకటేశ్వర్లునాయుడు, సంజీవి, సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదంటూ మాస్క్ లు తొడిగిన ఎస్పీ…!

Satyam NEWS

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన జగన్ ప్రభుత్వం…..

Satyam NEWS

క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యే మేడా పై 100 కోట్ల పరువు నష్టం దావా

Satyam NEWS

Leave a Comment