తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని 13వ రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరం గ్రామంలోని 5వ వార్డు 21వ బూత్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు ఇంటింటికి తిరిగి ప్రజలు పడుతున్న అవస్థల్ని వివరించారు.
నేడు కరెంటు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్ను పెంపు, పెట్రోల్ డీజిల్ ధరలు అధిక రేట్లు, నిత్యవసరాల ధరలు పెంపు, చెత్త పన్ను, ఆస్తి పన్ను అంటూ అన్ని పనులు వసూళ్లు చేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదలకుండా దోపిడీ చేస్తున్నారని, ఒక్కసారి అవకాశం అంటే నమ్మి ఓటేసినందుకు రాష్ట్రానికి ఇదేమి ఖర్మ అని ప్రజలకు వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 వ వార్డు ఇంచార్జి షేక్ హుస్సేన్, గాజుల సైదులు, నెల్లూరి బ్రహ్మయ్య, అట్లూరి అనీల్, షేక్ జాన్ సైదులు, గువ్వల పెద్దబ్బాయి, షేక్ ఇమాంస పాల్గోన్నారు.