39.2 C
Hyderabad
March 28, 2024 15: 36 PM
Slider కృష్ణ

అగ్ర రాజ్యం అమెరికాలో సత్తా చాటుతున్న తెలుగు వారు

అమెరికా లాంటి అగ్రరాజ్యంలో మన తెలుగు వారు ఐటి రంగంలోనూ మరియు ఇతర వ్యాపార రంగాలలోనూ ప్రథమ స్థానంలో ఉండడం తెలుగుజాతికి గర్వకారణం అని రాజేంద్రప్రసాద్ అన్నారు. అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో, ఓర్లండో సిటిలో మూడు రోజులు జరిగిన “ఐటి సర్వ్… సైనర్జీ” నేషనల్ కాన్ఫరెన్స్లో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు Y.V.B. రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

మూడు రోజులపాటు భారీ ఎత్తున జరిగిన ఈ కాన్ఫరెన్స్లో సుమారు 1500 మంది తెలుగువారు పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ఐటి కంపెనీల మరియు వివిధ వ్యాపార రంగాలకు చెందిన అధిపతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా దేశంలో మన తెలుగువారు సుమారు 30 వేల ఐటీ కంపెనీలను స్థాపించడం అలాగే అమెరికా దేశస్తులలో తలసరి సగటు ఆదాయంలో మన తెలుగువారే ప్రధమ స్థానంలో ఉండడాన్ని చూసి సాటి తెలుగువాడిగా గర్విస్తున్నానని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

సహజంగా మన తెలుగువారిలో ఉండే తెలివితేటలు, కృషి పట్టుదల, కష్టపడే మనస్తత్వం లతోనే ఈ విజయాలు సాదించగలిగారని అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని రాజకీయ రంగంలో కూడా మన తెలుగు వారు పట్టు సాధించాలని రాజేంద్ర ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఐటి మరియు వ్యాపార రంగాలతో పాటుగా ఇటీవల వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలోనూ మన తెలుగు వారు ప్రవేశించి ఘన విజయాలు సాధించడం తెలుగు జాతికి గర్వ కారణం అని, ఇదే స్ఫూర్తి తో అమెరికాలో ఉన్న మన తెలుగువారంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకొని, భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు ఆదర్శ వంతంగా నిలవాలని రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించినారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా మాజీ అధ్యక్షులు జయ తాల్లూరి, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, తానా ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయిన నిరంజన్ శృంగవరపు, తానా ట్రెజరర్ రవి పొట్లూరి, నాట్స్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, ప్రముఖ పారిశ్రామికవేత్త బొబ్బా రామ్ మరియు ఎన్నారై టిడిపి లీడర్స్ రవి మందలపు, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనాథ్ రావుల, ప్రసాద్ ఆకినేని, విజయ్, వెనిగళ్ళ రవి, హరీష్ కోయ, శ్రీనివాస్ తాతినేని, కెనడా దేశం నుంచి అనిల్ మరియు అనేకమంది ప్రముఖ ఐటీ కంపెనీలకు మరియు వివిధ వ్యాపార రంగాలకు చెందిన కంపెనీల ఆధిపతులు పాల్గొన్నారు.

Related posts

20న కొల్హాపూర్ కు ప్రియాంక

Bhavani

న్యూ బిగినింగ్: దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS

1095 పోలింగ్ కేంద్రాలు… 945094 మంది ఓటర్లు

Satyam NEWS

Leave a Comment