గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్లో 1డిగ్రీలు, భద్రాచలంలో 1.8 డిగ్రీలు, హనుమకొండలో 2 డిగ్రీలు, హైదరాబాద్లో 0.7 డిగ్రీలు, నల్లగొండలో 0.5 డిగ్రీలు, రామగుండంలో 1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న నాలుగు రోజులు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు ఏర్పడుతుందని తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీచవచ్చని పేర్కొన్నది.
ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 30 డిగ్రీలు, కనిష్ఠంగా 16డిగ్రీల వరకు ఉండొచ్చని వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది.