అనారోగ్యంతో పెద్దమ్మ తల్లి గుడి పూజారి మృతి చెందిన ఘటన డోర్నకల్ లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దమ్మ తల్లి గుడి లో రెడ్డబోయిన ఉపేందర్ 45 పూజారిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై శనివారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు.
మృతుడు ఉపేందర్ కు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సొంత ఇల్లు లేక పోవడంతో ఈ కుటుంబీకులు అద్దె ఇంట్లో ఉంటున్నారు.
ఉపెందర్ మృతి చెందడంతో ఇంటి ఓనర్ వెంటనే మృతదేహాన్ని తరలించాలని ఆదేశించడంతో అతని తమ్ముడు దహన సంస్కారాలు నిర్వహించారు.
అతని పెద్ద బిడ్డ వర్ష ఖమ్మంలో డిగ్రీ చదువుతుండగా, చిన్న బిడ్డ షణ్ముఖ మోడల్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతోంది.
తమ తండ్రి మృతితో దిక్కులేని వాళ్ల యామని విలపించడం పలువురు కంటతడి పెట్టారు .
ప్రభుత్వ అధికారులు స్పందించి అనాధలైన ఉపేందర్ కుటుంబీకులను ఆదుకోవాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.