చిత్తూరు జిల్లా నగరిలో పాడుబడిన నాగాలమ్మ దేవాలయాన్ని శాసనసభ్యురాలు ఆర్ కె రోజా పునర్ నిర్మించారు.
నగరి దేశమ్మ దేవాలయంలో భాగంగా ఉన్న నాగాలమ్మ గుడిని చాలా కాలంగా పాడుబడి ఉన్నది.
నాగాలమ్మను ఆరాధ్య దైవంగా చాలా మంది ఈ ప్రాంత వాసులు కొలుస్తారు.
అయితే గుడి పాడుబడిపోవడంతో దాన్ని బాగు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా ముందుకు వచ్చి రూ.4 లక్షలు వ్యయంతో పునర్నిర్మాణం చేసి గురువారం ప్రారంభించారు.
ఎమ్మెల్యే ఆర్కే రోజా తో బాటు ఆమె భర్త సెల్వమణి కూడా ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.