40.2 C
Hyderabad
April 19, 2024 15: 11 PM
Slider చిత్తూరు

జీతాలు అందని శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ గార్డులు

srikalashasthi

చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా జీతం ఇవ్వలేదంటూ ఆలయంలోని కార్యనిర్వహణ అధికారి కార్యాలయం వద్ద నిరసన తెలియజేసారు. ప్రైవేటు సంస్థ నుంచి 150 మంది సెక్యూరిటీ గార్డులుగా ఈ దేవస్థానంలో పనిచేస్తున్నామని దాదాపుగా  నాలుగు నెలల నుంచి జీతభత్యాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని సెక్యూరిటీ గార్డులు తెలిపారు.

జీతాలు ఇవ్వమంటూ అటు తమ సంస్థ ఉన్నత ఉద్యోగులను కోరినా, ఇటు ఆలయ అధికారులను కోరినా ఎవరూ సమాధానం చెప్పడం లేదని అన్నారు. దీంతో పండుగ దినం కూడా పస్తుఉండవలసిన  పరిస్థితి తమకు ఏర్పడిందని అన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్ :చైనా నుండి వచ్చిన విద్యార్థులకు పరీక్షలు

Satyam NEWS

జగన్మోహన్ రెడ్డి తో విద్యావవస్దలో సమూల మార్పులు

Satyam NEWS

బంగాళాఖాతంలో మరో సారి అల్పపీడనం

Satyam NEWS

Leave a Comment