ఆలయాల్లో హుండీల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీసులు అరెస్టు చేశారు.
కోనసీమలోని అల్లవరం, అమలాపురంలో మూడు దేవాలయాల్లో హుండీలను ఈ నిందితులు కొల్లగొట్టారు.
అలాగే కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్టేషన్ పరిధిలో రెండు బైక్ లను కూడా ఈ నిందితులు చోరీ చేశారు.
చోరీ సొత్తు రూ. 79 వేల నగదుతో పాటు రెండు బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.