రేపటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు, కోవిద్ నిబంధనలను అనుసరించి భక్తులు భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఆలయ పరిసరాలను ఎప్పటికపుడు సానిటైజ్ చేయాలన్నారు.