ఛత్తీస్ గఢ్ లో వంద మంది మావోయిస్టులకు కరోనా సోకిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పది మంది మావోయిస్టులు చనిపోయారని దంతెవాడ ఎస్పీ ప్రకటించారు.
జనజీవన స్రవంతిలోకి వస్తే చికిత్స చేయిస్తామంటూ పోలీసులు వారికి ఆఫర్ ఇచ్చారు. దాంతో ఇద్దరు మావోయిస్టు దంపతులు కాంకర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ వినీత్ ఖన్నా ముందుకు వచ్చారు.
వారిద్దరికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాంకేర్ ప్రభుత్య హాస్పిటల్ లో వారికి చికిత్స అందిస్తున్నారు. దండకారణ్య ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ను పోలీసులు నిలిపివేశారు.