విశాఖ పోలీసు రేంజ్ లో పదిమందికి ఎస్ఐ లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఆ పదిమంది విజయనగరం జిల్లా కూ చెందిన వారు కావడం అందులో వాళ్లంతా త్వరలో పలు స్టేషన్ లకు అదనపు ఎస్ఐలు పోస్టింగ్ ఇవ్వనున్నారు…జిల్లా ఎస్పీ రాజకుమారి.
ఈ మేరకు విశాఖ రేంజ్ పరిదిలోని విజయనగరం జిల్లా పోలీసుశాఖకు చెందిన ఎస్ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన పది మంది పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రాజకుమారి జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించారు.
ఉద్యోగోన్నతి పొందిన ఎస్ఐలు జిల్లా ఎస్పీ రాజకుమారిని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా ఎస్పీ వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగోన్నతి పొందిన అధికారులను ఇంకనూ ఎంత సర్వీసు ఉన్నది, ఇంత వరకు నిర్వహించిన విధుల్లో సాధించిన ప్రగతి, అనుభవాలు, దక్షతను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ – ఉద్యోగోన్నతి పొందిన అధికారులందరూ సుదీర్ఘమైన అనుభవం కలిగినందున పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులు, నిరాశ్రయుల పట్ల సానుకూలంగా వ్యవహరించి, వారి ఇబ్బందులను సహృదయంతో అర్ధం చేసుకొని, వారికి న్యాయం అందించేందుకు శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు.
విధి నిర్వహణలో ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, బాధితుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించి, న్యాయం చెయ్యాలన్నారు.
పోలీసుశాఖకు మంచి పేరును తీసుకొని వచ్చేందుకు కృషి చెయ్యాల్సిందిగా పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రాజకుమారి సూచించారు.
ఉద్యోగోన్నతి పొందిన 10మందిలో ఐదుగురికి విజయనగరం జిల్లాలోనే పని చేసేందుకు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, తదుపరి ఉత్తర్వులు కొరకు వీరంతా జిల్లా ఎస్పీ వద్ద హాజరయ్యారు.