నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఈరోజు గణేష్ నిమజ్జన ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అయితే కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కావాలని హిందువులపై దాడులు చేస్తున్నారని హిందూ వాహిని సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం కూడా హిందువులను అణగదొక్కాలని చూస్తోందని దానికి పోలీస్ శాఖ సహకరిస్తున్నదని హిందూ వాహిని సభ్యులు అంటున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా గణేష్ నిమజ్జనోత్సవ సమయంలో ఆనందంగా ఉండాల్సిన ఆ సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించి హిందువులపై దాడులు చేస్తున్నారని గణేష్ మండలి సభ్యులు ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా నిమజ్జనోత్సవం సమయములో పోలీసులు అత్యుత్సాహంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాదులో ఈరోజు ఒక వర్గం వారు బక్రీద్ పండగ నిర్ణయించుకోగా దానిని పోలీసులు దగ్గర ఉండి ఎలాంటి గొడవలు కాకుండా చూశారని అయితే హిందులపట్ల చిన్న చూపు చూస్తున్నారని హిందూ వాహిని సభ్యులు ఆరోపిస్తున్నారు.