టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పింది చెప్పినట్లు చేస్తున్న ఎస్.ఐ ను సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకీ తొత్తులుగా మరి పోలీసులు వ్యవహరిస్తున్నారని నినాదాలు చేస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని వేధిస్తున్న పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని వారు అన్నారు. భారీగా స్టేషన్ చుట్టూ మోహరించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మఠంపల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పక్షపాత వైఖరిపై నినాదాలు చేస్తూ ఎస్ఐ స్టేషన్ నుండి బయటకు రావాలి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.