27.7 C
Hyderabad
April 18, 2024 07: 11 AM
Slider హైదరాబాద్

నారాయణ గూడ కింగ్ కోఠి లో కరోనా టెన్షన్

Gandhi Hospital

ఈ ప్రాంతం నుంచి ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఆరుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మిగతా ఐదుగురి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి ఇంట్లో 46 మంది కుటుంబసభ్యులు ఉండడంతో వారికి కూడా కరోనా సోకి ఉంటుందన్న అనుమానం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడా వ్యక్తి నివాసంలో గాంధీ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరదా గెట్ ప్రాంతానికి చెందిన వారు. నాలుగు రోజుల క్రితం వారికి పరీక్షల నిమిత్తం అమీర్ పెట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ కు తరలించారు. అందులో ఒకరికి ఈ రోజు కరోనా పాజిటివ్ అని తేలింది. మిగిలిన ఐదుగురి రిపోర్ట్స్ ఇంకా రాలేదు. గాంధీ వైద్యుల పర్యవేక్షణలో అతని ఇంట్లోనే మిగిలిన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఈ ఆరుగురు ఎవరెవరిని కలిశారో అని స్థానికుల్లో టెన్షన్ ఏర్పడింది.

Related posts

కార్యాలయంలో పరిసరాలు పరిశుభ్రoగా ఉంచాలి

Bhavani

చేతి వృత్తుల వారిని అవమానపరిచిన సీఎం జగన్

Bhavani

ఘనంగా తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగ

Satyam NEWS

Leave a Comment