టీఆర్ఎస్ నేతల దాడిలో ఒకరు మరణించడం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొల్లాపూర్ పట్టణ కేంద్రానికి చెందిన పదో వార్డు లోని ఉపాధ్యాయుడు, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుడి అనుచరుడు అయిన గఫూర్, ఆయన సోదరుడు చాంద్ పాషా వారి కుటుంబ సభ్యుల దౌర్జన్యానికి ఒక వ్యక్తి బలి అయిపోయాడనే అరోపణలు వ్యాప్తి చెందడంలో ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కొల్లాపూర్ పట్టణ కేంద్రం పదవ వార్డు కు చెందిన అబ్దుల్ రహీం పై ఈ కుటుంబం కొద్ది రోజుల కిందట దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్ రహీం హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించాడు. ఇదివరకు టీఆర్ఎస్ నాయకుడి అనుచరులు, అతని కుటుంబ సభ్యులు కొట్టిన దెబ్బల వలనే ఈరోజు అబ్దుల్ రహీం మృతి చెందారని మృతిని కుటుంబ సభ్యులు గఫూర్, చాంద్ పాషా ఇంటిముందు మృతదేహంతో బైఠాయించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్