వనపర్తిలో దేవాలయాలు, మసీదులు కూల్చివేతను నిరసిస్తూ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ దొంగల మాదిరి అర్ధరాత్రి తొలగించడం సరికాదన్నారు. చిన్నారెడ్డి మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాదన జరిగింది. ఉద్రిక్తత ఏర్పడింది.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్