పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదుల హింసాత్మక కార్యక్రమాలు మళ్లీ పెరిగిపోతున్నాయి. తాజాగా క్వెట్టా నగరంలోని కోర్టు వెలుపల జరిగిన సాయుధ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ముష్కరుల దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెషన్స్ కోర్టు ఎదుటే ఈ దాడి జరిగింది.
పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ప్రకారం, దాడిలో గాయపడిన సర్దార్ నసీమ్ తరీన్ కోర్టు విచారణ తర్వాత బయటకు వస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి అతనిపై మొదట కోర్టు ఆవరణలో కాల్పులు జరిపాడు. ఆ తరువాత బయట వేచి ఉన్న ఇతర దుండగులు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో తరీన్తో పాటు అక్కడున్న వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.