జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాంలో నాన్ లోకల్ లేబర్పై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వలస కూలీలపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. కూలీల ఇళ్లల్లోకి చొరబడి మరీ కాల్పులకు దిగుతున్నారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారు బీహార్కు చెందిన రాజా దేషిదేవ్, జోగిందర్ రేషి దేవ్గా గుర్తించారు పోలీసులు. కూలీలు, ఉద్యోగులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ను ఆశ్రయించాలని సూచించారు. అయితే రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు కూలీలను పొట్టనబెట్టుకున్నారు ఉగ్రవాదులు.