30.7 C
Hyderabad
April 16, 2024 23: 09 PM
Slider ముఖ్యంశాలు

గచ్చీబౌలీ కేర్ లో ఠాగూర్ సినిమా రిపీట్

#Care Hospital

ఇది సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ హాస్పటల్ వైద్యులు చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నామని చెప్పి తమను మోసం చేశారని, డబ్బులు కట్టించుకుని చివరకు శవాన్ని అప్పగించారంటూ కేర్ ఆస్పటల్ ముందు బాధితులు ధర్నాకు దిగారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుఖ్ దేవ్( 34) భార్యాపిలల్లతో కలిసి బోయిన్ పల్లిలో నివసిస్తూ పెయింటింగ్ పని చేస్తుంటాడు. ఈనెల 7న తన బైక్ పై పెయింటింగ్ వేసే పనిమీద బయటకు వెళ్తుండగా గుర్తు తెలియని కారు సుఖ్ దేవ్ బైక్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సుఖ్ దేవ్ ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను ఈనెల 8న మరణించినట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అతనికి మెరుగైన చికిత్స చేస్తున్నామని చెప్పి డాక్టర్లు రూ.3లక్షల కట్టించుకున్నారని, చివరకు చనిపోయాడంటూ శవాన్ని అప్పగించారని ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

నెవర్:ఇమ్రాన్ ఖాన్ భారత గగనతలం గుండా పొడట

Satyam NEWS

బాసరలో ఆఖరి శ్రావణ శుక్రవారం పూజలు

Satyam NEWS

ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి తెలుగు సినిమా లెజండరీస్ పురస్కారం

Satyam NEWS

Leave a Comment