ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ వివేక్ నగర్ లోని మహిళా భవనం నిధులు కొరతతో అసంపూర్తిగా లైట్లు ,ఫ్యాన్లు, వైరింగ్ ,ఫ్లోరింగ్ ,గ్రిల్లు పనులు పెండింగ్ లో ఉన్నాయని వివేక్ నగర్ మహిళలు మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణా నాగేశ్వర్ రావు కి సమస్యను తెలిపారు. సానుకూలంగా స్పందించిన గంధం జోష్ణా ,ప్రత్యేక శ్రద్ధతో సంబందిత అధికారులతో మాట్లాడి పనులకు నిధులు శాంక్షన్ చేయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఈ మాట్లాడుతూ
సాంక్షన్ అయిన నిధులతో మహిళా భవన్ లోనీ పెండింగ్ పనులను సాద్యమైనంత త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ నగర్ కాలనీ మహిళలు జీ.హెచ్.ఎం.సీ. మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణా నాగేశ్వర్ రావు, ఈ .ఈ. నాగేందర్ లకు ప్రతేకధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లొ వివేక్ నగర్ మహిళలు సరితా ,స్వప్నా ,అరుణ ,విజయ ,సంగీత ,అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి