Slider హైదరాబాద్

ధాంక్స్: నిండు గర్భిణికి సాయం అందించిన పోలీసులు

#Gandhinagar Police

పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేలా గాంధీనగర్ పోలీసులు ప్రవర్తించారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది. బన్సీలాల్ పేట్ నుంచి రాజు యాదవ్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేసి తమ ఇంటి వద్ద ఒక మహిళకు పురిటినొప్పులు వచ్చాయని ఆసుపత్రికి వెళ్లేందుకు మార్గం లేక ఇబ్బంది పడుతున్నదని చెప్పాడు.

ఫోన్ కాల్ అందుకున్న డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ తక్షణమే స్పందించారు. ఆయన సిబ్బందిని తీసుకుని తన వాహనంలో అక్కడకు వెళ్లి విచారించారు. బీహార్ కు చెందిన సంధ్యా దేవి అనే మహిళ పురిటి నొప్పులతో ఉండటం చూసి వెంటనే ఆమెను తన కారులో ఎక్కించి సుల్తాన్ బజార్ లోని మెటర్నిటీ ఆసుపత్రికి పంపించారు.

Related posts

శివరాత్రి సందర్భంగా రామతీర్థం లో ఎన్సీసీ సేవలు

Satyam NEWS

నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం “నేను – కీర్తన”

Satyam NEWS

గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేయండి

Satyam NEWS

Leave a Comment