27.7 C
Hyderabad
March 29, 2024 04: 05 AM
Slider కరీంనగర్

హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర  మున్నూరు కాపుల  సంఘం

#ministergangula

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరు కాపు ధర్మకర్తల సంస్థకు 5 ఎకరాల భూమి, 5 కోట్ల రూపాయలు కేటాయించినందుకు రాష్ట్ర మున్నూరు కాపుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

మున్నూరు కాపు ధర్మకర్తల సంస్థకు ఇస్తున్న 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయల పత్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా కాపు ధర్మకర్తల సంఘం నాయకులు అందుకున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని చెన్నారెడ్డి మానవ వానరుల అభివృద్ది సంస్థ లో జరిగింది. ఈ కార్యక్రమం లో  రాజ్యసభ సభ్యులు వద్దిరాజు  రవిచంద్ర (గాయత్రి రవి), దానం  నాగేందర్, ప్రకాష్, కొండ దేవయ్య, సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్ కన్వీనర్ ఎపెక్స్ కౌన్సిల్, ఉప్పల్ నియొజకవర్గం మున్నురుకాపు కన్వీనర్ గంథం నాగేశ్వరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి 

Related posts

ఎస్పీ ఆదేశాలిచ్చారు… సిబ్బంది పాటించారు…!

Bhavani

విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌ అశోక్ గజపతిరాజు హాయాంలో జ‌ర‌గలేదా

Satyam NEWS

శ్రీశైల పాదాచార శివ స్వాములకు అన్నప్రసాద పంపిణీ

Bhavani

Leave a Comment