దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోడీకి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం రోజు బిజెపి నేతలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజు బిచ్కుంద మండలం బిజెపి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని మండల అధ్యక్షులు, కార్యకర్తలు కలిసి బాజపా రాష్ట్ర రథసారధి బండి సంజయ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు, జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు అరుణతార ఆదేశాల మేరకు 20 న అన్ని మండల కేంద్రాల్లో ని ప్రభుత్వ ఆసుపత్రులలో మండల అధ్యక్షులు కార్యకర్తలతో వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం చేపడతారు.
మోడీ కి పాలాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి గ్రామ బూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గ్రామస్థాయి కార్యకర్తలు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని భాజపా అద్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జహిరాబాద్ ఇన్చార్జి జుట్టు సాయిలు, మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైఫుల్లా ఖాన్, బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ పండరి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గోపాల చారి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి తోటవార్ సందీప్, మైనార్టీ మండల అధ్యక్షుడు షాకిబ్ ఖాన్, మేక్క మైనార్టీ గ్రామ అధ్యక్షుడు కలిల్, పుల్కల్ గ్రామ అధ్యక్షుడు రాజిరెడ్డి, పుల్కల్ వార్డు మెంబర్ పాల్గొన్నారు.
జీ.లాలయ్య, సత్యంన్యూస్ రిపోర్టర్, జూక్కల్ నియోజకవర్గం