రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి కి పూర్తి మద్దతు ప్రకటించిన సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావుకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని మహోద్యమానికి వసంత నాగేశ్వరరావు అనుభవాలు, సూచనలు, సలహాలు చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి అమరావతి చుక్కాని వంటిది అని బాలకోటయ్య అన్నారు. ఆదివారం నాడు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వసంత నాగేశ్వరరావు స్వగృహానికి వెళ్ళి పలుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను క్షోభ పెట్టిన పాలకులు క్షోభకు గురికాక తప్పదని హెచ్చరించారు.
previous post