బజరంగ్ బంజారా సేవా సంఘం గిరిజన హక్కుల సమావేశం అంబర్పేట డివిజన్ న్యూ పటేల్ నగర్ లోని సరస్వతి స్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం పార్టీ డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారాహిల్స్ లో బంజారా ఆత్మగౌరవ భవన్ నిర్మించడం జరిగిందని, అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బంజారా కులస్తుల్లో కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, బంజారా సంఘం నాయకులు జటావత్ రమేష్ నాయక్, వీరన్న నాయక్, చందర్ నాయక్, గోపాల్ నాయక్, మన్నయ్య నాయక్, రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, మెచ్చు నాయక్, వెంకన్న నాయక్, అనిల్ నాయక్, చందు నాయక్, బాప నాయక్, చక్రి నాయక్, కృష్ణా నాయక్, నరేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట