అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే సగానికిపైగా ఆలయ నిర్మాణం పూర్తి అయ్యిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణ క్రతువు మొదలైందని, ప్రధాని మోదీ బలమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో ఆలయ నిర్మాణ పనులు సాగుతున్నట్లు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రజలందరి సహకారంతో దీనిని నిర్మిస్తున్నామన్నారు.
previous post
next post