24.7 C
Hyderabad
March 29, 2024 05: 53 AM
Slider గుంటూరు

ప్రజాగళం వినిపించే కుండబద్దలు సుబ్బారావు మృతి బాధాకరం

#Kundabadalu Subbarao

నిరంతరం ప్రజా సమస్యలపై గళం వినిపించే కుండబద్దలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కాటా సుబ్బారావు మృతి చెందడం బాధాకరమని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని నిర్వహించిన ఉద్యమంలో ఆయనతో కలిసి పని చేసిన విషయం మరచిపోలేమన్నారు.

మంగళవారం నాడు నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో సుబ్బారావు స్వగృహంలో ఆయన పార్దీవదేహానికి పూలమాల వేసి రావుసుబ్రహ్మణ్యం నివాళులు అర్పించారు. ప్రజాగళం కుండబద్దలు కొట్టినట్లు వినిపించింది సుబ్బారావు మాత్రమే అన్నారు.

అందుకే అంత వయస్సులో కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులు తప్పులేదు అన్నారు.సీఐడీ నోటీసులు ఇవ్వడం ఆయనపై జరిగిన వేధింపులకు నిదర్శనం అన్నారు. సుబ్బారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని నవతరంపార్టీ నుండి తెలిపారు.

Related posts

నీటి ప్రాజెక్టుల్లో రాయలసీమకు తీరని అన్యాయం

Satyam NEWS

మృతురాలి కుటుంబానికి పరామర్శ

Satyam NEWS

ఎన్నారై టీడీపీ నేత చలపాటి చంద్ర పై వైసీపీ నేతల దాడి

Satyam NEWS

Leave a Comment