అభివృద్ధి పనులు ప్రారంభం
ఖమ్మం జిల్లాలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , శ్రీనివాసగౌడ్ కోటి రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ-ఖమ్మం, తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటి అధ్వర్యంలో రూ.89 లక్షలతో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంను వారు ప్రారంభించారు. వైరా రిజర్వాయర్ నందు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ అద్వర్యంలో రూ.13 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 6-సీట్ల సామర్ధ్యం కలిగిన రెండు స్పీడ్ బోట్స్ ను వారు ప్రారంభించారు. అనంతరం బోట్ ఎక్కి రిసర్వాయర్ లో తిరిగారు . తెలంగాణను ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నదని అన్నారు.