కొత్త గా అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు చేయడం హుజూర్నగర్ లోని, న్యాయవాదులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, హుజూర్నగర్ కు ఎన్నికైన ప్రజాప్రతినిధిగా గతంలో కూడా మంజూరైన జ్యుడీషియల్ కాంప్లెక్స్కు మంచి మౌలిక సదుపాయాలు అందించడం, చాలా సంతృప్తిని తనకు కలిగించే విషయమని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి కోర్టును హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయడం పట్ల హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
వారి అలుపెరగని కృషి వల్లనే అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి కోర్టు మంజూరుకు కారణమైందని అన్నారు. హుజూర్నగర్ లో పై అదనపు జిల్లా,సెషన్స్ జడ్జి కోర్టు మంజూరు కోసం తాను వినయపూర్వకమైన ప్రయత్నాలను కూడా అందించినందుకు తాను సంతోషిస్తున్నాను అని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష్య,సభ్యులు కోరుకుంటే,ప్రారంభ వేడుకలకు తెలంగాణ చీఫ్ జస్టిస్,సి.జె.ఐ లను ఆహ్వానించడంలో తాను వారికి సహాయం చేయగలనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణా చీఫ్ జస్టిస్ కి తాను లేఖ రాస్తానని,ఇప్పుడు 7,000 కేసులు పెండింగ్లో ఉన్నందున హుజూర్నగర్ కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంజూరు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నానని అన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్